TTD

టీవీ-5 అధినేత బీఆర్‌ నాయుడికి సీఎం చంద్రబాబు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) చైర్మన్‌ పదవి;

23 మంది సభ్యులతో కూడిన టీటీడీ బోర్డు ముగ్గురు ఎమ్మెల్యేలకు అవకాశం సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్‌: టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) నూతన బోర్డు సభ్యులను ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ చైర్మన్‌ పదవిని టీవీ-5 అధినేత బీఆర్‌ నాయుడికి అప్పగించారు. టీటీడీ బోర్డు సభ్యులుగా మొత్తం 23 మందిని నియమించారు బోర్డులో నియమితులైన సభ్యులలో ముగ్గురు ఎమ్మెల్యేలు జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ కోవూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మడకశిర నుంచి ఎంఎస్ రాజు ఉన్నారు వీరితో పాటు టీడీపీ నాయకులు పనబాక లక్ష్మి, జాస్తి శివ (సాంబశివరావు) నన్నపనేని సదాశివరావు కోటేశ్వరరావు మల్లెల రాజశేఖర్ గౌడ్ జంగా కృష్ణమూర్తి, శాంతారాం, పి. రామ్మూర్తి, తమ్మిశెట్టి జానకీదేవి, నరేశ్ కుమార్ సభ్యులుగా నియమితులయ్యారు.

తెలంగాణ నుంచి నర్సిరెడ్డి, బుంగునూరు మహేందర్ రెడ్డి, ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్‌ బురగపు ఆనంద్ సాయి, రంగశ్రీ, భారత్ బయోటెక్ సంస్థకు చెందిన సుచిత్ర ఎల్ల కూడా సభ్యులుగా నియమితులయ్యారు కర్ణాటక నుంచి జస్టిస్ హెచ్‌ఎల్‌ దత్, దర్శన్ ఆర్‌ఎన్, గుజరాత్ నుంచి డాక్టర్‌ అదిత్ దేశాయ్, మహారాష్ట్ర నుంచి సౌరబ్ హెచ్ బోరా, తమిళనాడు నుంచి కృష్ణమూర్తి కూడా ఈ బోర్డు సభ్యులుగా ఎంపికయ్యారు. జనసేన కోటాలో తెలంగాణ నుంచి మహేందర్ రెడ్డి కి అవకాశం దక్కింది అయితే, ఈ సభ్యుల నియామకంపై అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు. ఈ జాబితాపై టీడీపీలో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ బోర్డులో చోటు దక్కుతుందని ఆశించిన వారు నిరాశ చెందుతున్నట్లు సమాచారం. అనేక రాజకీయ సమీకరణలు, సవాళ్లు, వడపోతలు చేసిన తర్వాత సీఎం చంద్రబాబు ఈ జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది

బీఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్ పదవి అప్పగించాలన్న చర్చలు గత కొన్ని నెలలుగా జరుగుతున్నాయి నాయుడు టీవీ-5 మీడియా అధినేతగా వ్యవహరిస్తున్న సమయంలోనే ఈ బాధ్యత దక్కింది. అయితే, బీఆర్ నాయుడు కుమారుడిపై వచ్చిన వివిధ ఆరోపణలు ఈ నియామకానికి మరింత చర్చనీయాంశం కావడంతో ఈ నిర్ణయం వివాదాస్పదమైంది ఆయన కుమారుడు హౌసింగ్ సొసైటీ అవకతవకలు, రియల్ ఎస్టేట్ అక్రమాలు, డ్రగ్స్ వినియోగదారులతో సంబంధాలపై వచ్చిన ఆరోపణలు ఆయన చుట్టూ వివాదాలకు దారి తీసాయి. తెలంగాణ హైకోర్టు కూడా ఈ వ్యాపారాలపై సీరియస్‌ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయినప్పటికీ, టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడి నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అసలు ఈ నియామకం ఎన్నికలకు ముందే టీడీపీతో నాయుడి ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

Related Posts
జనవరిలో ఫ్లెమింగో ఫెస్టివల్
flemming1

జనవరిలో ఫ్లెమింగో ఫెస్టివల్ పక్షుల పండుగను మొదలైన సన్నాహాలు తిరుపతి జిల్లా (శ్రీహరికోట )సూళ్లూరుపేటలోని పులికాట్ సరస్సు అంతర్జాతీయ పక్షుల పండుగకు సిద్ధం అయ్యింది. ఫ్లెమింగో ఫెస్టివల్ Read more

వైస్ షర్మిల కు వార్నింగ్ ఇచ్చిన కళ్యాణి
sharmila dharna

కడప జిల్లాకు చెందిన వైసీపీ సోషల్ మీడియా వర్కర్ వర్రా రవీంద్రారెడ్డి భార్య కల్యాణి.. వైఎస్ షర్మిళను తీవ్రస్థాయి లో హెచ్చరించారు. కడప జిల్లా పోలీసులు వర్రా Read more

తెలుగు రాష్ట్రాలకు రికార్డు స్థాయిలో రైల్వే బడ్జెట్
తెలుగు రాష్ట్రాలకు రికార్డు స్థాయిలో రైల్వే బడ్జెట్

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలకు భారీ స్థాయిలో రైల్వే బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. Read more

ఎమ్మెల్యే కొలికపూడిపై చంద్రబాబు సీరియస్
TDP High command Serious On

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై టీడీపీ అధిష్ఠానం సీరియస్ గా ఉంది. ఇటీవల ఆయన ఓ ఎస్టీ మహిళపై దాడి చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *