ttd temple

టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం

టీటీడీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సర్వత్తరా విమర్శలు వస్తున్న నేపథ్యంలో తొక్కిసలాట ఘటనపై శుక్రవారం టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన, ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, సమీక్ష అనంతరం శుక్రవారం టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై శుక్రవారం టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. తిరుమలలోని పాలక మండలి కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు సమావేశం కానుంది. తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు పరిహారంపై సమావేశంలో తీర్మానం చేసే అవకాశముంది.
బాధిత కుటుంబ సభ్యులకు పరిహారం చెక్కులు తయారు చేసే అంశంపై , ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం చెక్కులను రేపు (శనివారం) అందజేసే అంశంపై చర్చించనున్నారు. అదేవిధంగా వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ తొక్కిసలాటపై టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన చర్చ జరుగనుంది.

గత బుధవారం రాత్రి తిరుపతిలోని పద్మావతి గార్డెన్‌లో నెలకొల్పిన టోకెన్ల పంపిణీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఆరుగురు మృత్యువాత పడగా 48 మంది గాయపడ్డారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీఎస్పీ పాటు గోశాల డైరెక్టర్‌ను సస్పెండ్‌ చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈవో గౌతమి, సీవీఎస్‌వో శ్రీధర్‌ను అక్కడి నుంచి బదిలీ చేశారు. ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 25 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి లక్ష చొప్పున ప్రభుత్వం పరిహారంగా ప్రకటించింది.

Related Posts
మరో 5 నెలల్లో అందుబాటులోకి విజయవాడ వెస్ట్ బైపాస్
Vijayawada West Bypass unde

విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు దశాబ్దాలుగా ప్రతిపాదనలో ఉన్న వెస్ట్ బైపాస్ రహదారి పూర్తి కావొస్తుంది. ప్రస్తుతం 95% పనులు పూర్తవగా, మిగిలిన పనులు త్వరలోనే Read more

హైందవ శంఖారావం మహాసభ- ట్రాఫిక్ మల్లింపు
హైందవ శంఖారావం మహాసభ- ట్రాఫిక్ మల్లింపు

కేసరిపల్లి గ్రామం గన్నవరం మండలం, కృష్ణాజిల్లా నందు ది 05.01.2024 జరగబోవు హైందవ శంఖారావం మహాసభ పురస్కరించుకొని ఈ క్రింది విధంగా పోలీసులు ట్రాఫిక్ మల్లింపు చేయడమైనది.హైందవ Read more

నేడు ‘రుషికొండ’కు సీఎం చంద్రబాబు
CM Chandrababu ongoing visit to Delhi . Meeting with Union Ministers 1

సీఎం చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా నేడు విశాఖలోని రుషికొండ భవనాలను పరిశీలించనున్నారు. గత ప్రభుత్వ కాలంలో రూ.500 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనాలను Read more

ఎట్టకేలకు పేర్ని నానిపై కేసు నమోదు
Perni Nani

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తూ వారిని ఇబ్బందికి గురిచేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మచిలీపట్నం రేషన్‌ బియ్యం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *