ttd

టీటీడీలో కొనసాగుతున్న అంతర్గత గొడవలు

ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై అంతర్గత గొడవలు కొనసాగుతూనే వున్నాయి. నిన్న వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశం కూడా రచ్చ రచ్చగా మారింది. తిరుమల ఆలయ పాలనా వ్యవహారాల్లో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పాలక మండలి సభ్యులు నిప్పులు చెరిగారు. అధికారుల ఏకపక్ష తీరు వల్లే టీటీడీ చరిత్రలోనే మొదటిసారిగా సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగిందని విమర్శించారు.

ప్రధానంగా ఈవో శ్యామలరావు వ్యవహార శైలిని పాలక మండలి సభ్యులు తప్పుబట్టినట్లు సమాచారం! తొక్కిసలాట బాధిత కుటుంబాలకు చేయాల్సిన సహాయంపై తీర్మానాలు చేసేందుకు వీలుగా తక్షణం బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీంతో… శుక్రవారం టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన శుక్రవారం తిరుమలలో పాలక మండలి భేటీ అయ్యింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముగ్గురు సభ్యులు మినహా మిగిలిన సభ్యులు… ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. సీఎం ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ భేటీ కూడా ‘అధికారులు వర్సెస్‌ పాలకమండలి’గా మారింది. సమావేశ ప్రారంభంలోనే చైౖర్మన్‌ నాయుడు టీటీడీ అధికారుల తీరుపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు.

అధికారులు తీసుకునే తప్పుడు నిర్ణయాలకు తాము రాజకీయంగా మూల్యం చెల్లించాల్సి వస్తుందని బోర్డు సభ్యుడు, టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. అధికారులు ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకుంటారని… ప్రజా క్షేత్రంలో తాము సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలని సూచించారు. ‘‘పాలక మండలి సభ్యులకు అధికారులు కనీస గౌరవం ఇవ్వడం లేదు. వైకుంఠ ఏకాదశికి భక్తులు భారీగా వస్తారని అందరికీ తెలిసిందేనని… ఈ విషయంలో అధికారుల ప్రణాళిక ఏమిటో, దీనిని ఏ రకంగా నిర్వహించదల్చుకున్నారో తమకు సమాచారం లేదని ఒక సభ్యుడు చెప్పారు.

Related Posts
దావోస్ లో చంద్రబాబు రేవంత్ భేటీ
దావోస్ లో చంద్రబాబు రేవంత్ భేటీ

తెలుగు రాష్ట్రాల మధ్య పెట్టుబడుల పోటీని మరింత ప్రోత్సహిస్తూ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు Read more

లడ్డూ వివాదం.. నేడు తిరుమలకి పవన్ కల్యాణ్
Laddu controversy. Pawan Kalyan to Tirumala today

Laddu controversy.. Pawan Kalyan to Tirumala today అమరావతి: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాలా సీరియస్ గా Read more

ఆర్థిక సవాళ్లు ఉన్నా సంక్షేమ పథకాలకే ప్రాధాన్యం: చంద్రబాబు
ఆర్థిక సవాళ్లు ఉన్నా సంక్షేమ పథకాలకే ప్రాధాన్యం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ గత పరిపాలన నుండి వచ్చిన తీవ్రమైన సవాళ్లను నొక్కిచెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో Read more

అల్పపీడనం ప్రభావం తో ఏపీలో వర్షాలు
imd warns heavy rains in ap and tamil nadu next four days

ఆంధ్రప్రదేశ్ ను వరుస వర్షాలు వదలడం లేదు. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడగ..ఇప్పుడు శీతాకాలంలో కూడా వరుసగా వర్షాలు పలకరిస్తూనే ఉన్నాయి. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *