Abdul Rahim Rather appointed as Speaker of Jammu and Kashmir Assembly

జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ స్పీకర్‌గా అబ్దుల్‌ రహీమ్‌ రాథర్‌ నియామకం

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ స్పీకర్‌ గా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ ఎమ్మెల్యే అబ్దుల్‌ రహీమ్‌ రాథర్‌ ఎన్నికయ్యారు. ఈ మేరకు సీఎం ఒమర్‌ అబ్దుల్లా సమక్షంలో ప్రొటెం స్పీకర్‌ ముబారక్‌ గుల్‌.. అసెంబ్లీ స్పీకర్‌గా అబ్దుల్‌ రహీమ్‌ పేరును ప్రతిపాదించారు. కాగా, అబ్దుల్‌ రహీమ్‌ రాథర్‌ ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బుద్గాం జిల్లాలోని చరార్‌-ఇ-షరీఫ్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేడు తొలిరోజు సభను ఉద్దేశించి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ప్రసంగించనున్నారు.

కాగా, స్పీకర్‌ పదవికి పోటీ చేయకూడదని ప్రతిపక్షాలు నిర్ణయించడంతో మూజువాణి ఓటుతో అబ్దుల్‌ రహీమ్‌ రాథర్‌ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్‌ ముబారక్‌ గుల్‌ ఎన్నికలు నిర్వహించారు. వ్యవసాయ మంత్రి జావేద్‌ అహ్మద్‌ దార్‌ స్పీకర్‌ పదవికి అబ్దుల్‌ రహీమ్‌ను ఎంపిక చేయాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, ఎన్‌సి ఎమ్మెల్యే రాంబన్‌ అర్జున్‌ ఈ తీర్మానాన్ని బలపరిచారు. ఎన్నికల అనంతరం, శాసనసభ అధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా, ప్రతిపక్ష బీజేపీ నేత సునీల్‌ శర్మలు అబ్దుల్‌ రహీమ్‌ వెంట వెళ్లగా ఆయన స్పీకర్‌ కుర్చీని అధిరోహించారు. నేటి నుండి ఐదురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అబ్దుల్‌ రహీమ్‌ గతంలో కూడా జమ్ముకాశ్మీర్‌ అసెంబ్లీలో స్పీకర్‌ పదవిని చేపట్టారు. పిడిపి-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో 2002-2008 వరకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. 2018లో చివరిగా జమ్ముకాశ్మీర్‌లో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఆరేళ్లకు పైగా విరామం తర్వాత నేడు అసెంబ్లీ సమావేశమైంది.

ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్ము కశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎన్‌సీ పార్టీ భారీ విజయం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఒమర్‌ అబ్దుల్లా నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కూడా కొలువుదీరింది. ఈ క్రమంలోనే దాదాపు ఆరేళ్ల తర్వాత తొలిసారిగా జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి.

Related Posts
ఏపీలో అతి తీవ్ర భారీ వర్షాలు పడే ఛాన్స్
imd warns heavy rains in ap and tamil nadu next four days

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన 'ఫెంగల్' తుఫాన్ గడిచిన 6గంటల్లో 10 కిమీ వేగంతో కదులుతోందని APSDMA తెలిపింది. పుదుచ్చేరికి 100 కి.మీ, చెన్నైకి 100 కి.మీ. దూరంలో Read more

ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పులు
mat

అమెరికా ప్రతిపక్ష పార్టీ రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రతినిధి, ఫ్లోరిడా లోక్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ సభ్యుడు మ్యాట్ గేట్జ్ హౌస్‌ను విడిచిపెట్టారు. ఆయనను, రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు Read more

మరో 487 వలసదారుల బహిష్కరణ
మరో 487 వలసదారుల బహిష్కరణ

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 487 మంది భారతీయ వలసదారులను త్వరలో బహిష్కరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని అమెరికా అధికారులు భారత ప్రభుత్వానికి తెలియజేశారని, వారిపై Read more

కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం
Encounter in Kupwara. Terrorist killed

శ్రీనగర్‌: మరోసారి జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. కుప్వారా జిల్లాలో భద్రతా బలగాలు తాజాగా మరో ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఘటనా స్థలం Read more