చైనాలో హెచ్ఎమ్పివి (హ్యూమన్ మెటాప్యూమోవైరస్) వ్యాప్తి గురించి వివిధ ఊహాగానాలు వచ్చినప్పటికీ, భారతదేశంలోని ఆరోగ్య సంస్థలు “ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని స్పష్టం చేశాయి.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్, అతుల్ గోయల్, విలేకరులతో మాట్లాడుతూ, “భారతదేశంలో ఇంకా శ్వాసకోశ సంబంధిత అనారోగ్యాలు లేదా హెచ్ఎమ్పివి కేసులు నమోదు చేయబడలేదు” అని తెలిపారు.
“చైనాలో హెచ్ఎమ్పివి వ్యాప్తి గురించి వార్తలు రావడం వాస్తవమే అయినప్పటికీ, మేము దీనిని అంతే తీవ్రమైనదిగా చూడడం లేదు. ఇది ఎక్కువగా పెద్దలు మరియు 1 ఏళ్లలోపు చిన్న పిల్లల్లో ఫ్లూ వంటి లక్షణాలు కలిగించే ఇతర శ్వాసకోశ వైరస్లా ఉంటుంది,” అని గోయల్ వివరించారు.
శీతాకాలంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు సాధారణమేనని, వాటి కోసం భారతదేశంలోని ఆసుపత్రులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు. “ఈ వ్యాధి వలన వోచే సమస్యల పరిష్కారాల కోసం ప్రత్యేక మందులు అవసరం లేదు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో పెద్ద స్థాయి కేసులు లేవు, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు,” అని గోయల్ చెప్పారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సిడిసి) దేశంలో శ్వాసకోశ వ్యాధులపై నిఘా పెట్టి, కాలానుగుణ ఇన్ఫ్లుఎంజా కేసులను పర్యవేక్షిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. చైనాలో హెచ్ఎమ్పివి వ్యాప్తి గురించి అధికారికంగా నిర్ధారించబడిన సమాచారం లేదు, కానీ ఎన్సిడిసి అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపింది.
Also Read: ఏపీ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ 2025
శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధుల కేసులు పెరగడం సాధారణం. ఈ నేపథ్యంలో, చైనా డిసెంబర్ చివరలో తెలియని మూలాల న్యుమోనియా కేసులను పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసిందని ప్రకటించింది. 5 సంవత్సరాల క్రితం కోవిడ్-19 ఉద్భవం తరువాత, ఈ వ్యవస్థ ప్రాసెస్లను మెరుగుపర్చడం, వైరస్లను గుర్తించడం మరియు నిర్వహించడం కోసం ప్రోటోకాల్లు ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టింది.