r.krishnaiah

చంద్రబాబు పాలన బాగుంది: ఎంపీ కృష్ణయ్య

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనా బాగుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. చంద్రబాబు పాలన బాగుందని..మంచి పరిపాలన దక్షుడని.. విజనరీ ఉన్న నేతని… సంపద సృష్టించి పేదరికాన్ని రూపుమాపాలని ఆలోచించే నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. మేధావులలోనూ, విద్యావేత్తలలో చంద్రబాబుపై మంచి అభిప్రాయం ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధాని దృష్టికి తప్పకుండా తీసుకువెళ్తామని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంచి హృదయం ఉన్న నాయకుడని, పేద ప్రజలను చూస్తే… కరిగిపోయే మనస్సున్న నేత పవన్ కల్యాణ్ అని ఆర్ కృష్ణయ్య అన్నారు. కాగా సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారి విశాఖకు వస్తున్నారని, ప్రధానికి నీరాజనం పట్టడానికి విశాఖ ప్రజలు సిద్దం అయ్యారన్నారు. విశాఖ ప్రాంతం అభివృద్దికి చర్యలు తీసుకుంటారని భావిస్తున్నామన్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత భారత్ అన్నిరంగాలలో గణనీయమైన అభివృద్దిని సాధిస్తోందన్నారు.

ప్రధాని మోదీ విశాఖ సభా వేదికగా 12కు పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ఆరుకు పైగా రహదారులను జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పనుల విలువ దాదాపు రూ. రెండు లక్షల కోట్ల పైమాటే. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్‌టీపీసీ రూ.1.85 లక్షల కోట్లతో గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ఏర్పాటు. 57 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్టును 1,600 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు.

Related Posts
బీఎల్వోలకు త్వరలో గౌరవ వేతనాలు
AP BLO

ఆంధ్రప్రదేశ్‌లోని 4,638మంది బూత్ లెవల్ ఆఫీసర్ల (BLO)కు త్వరలో గౌరవ వేతనాలు అందించనున్నట్లు సమాచారం. 2021-22 నుంచి వేతనాలు రాకపోవడంతో BLOలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Read more

రాష్ట్రాన్ని వర్క్ ఫ్రం హోమ్ హబ్ గా మారుస్తాం – చంద్రబాబు
chandrababu naidu

ఆంధ్రప్రదేశ్‌ను వర్క్ ఫ్రం హోమ్ హబ్‌గా అభివృద్ధి చేయడం తన ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం దిశగా మారుతున్న పరిస్థితులను దృష్టిలో Read more

చిరంజీవి రాజకీయాలకు పనికి రాడు – అంబటి
ambati chiru

మెగాస్టార్ చిరంజీవి చేసిన తాజా రాజకీయ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ప్రజారాజ్యం పార్టీ జనసేనగా మారిందని చిరంజీవి చేసిన ప్రకటనపై అంబటి Read more

వైకుంఠ ఏకాదశి: తిరుమలలో ఏర్పాట్లు
వైకుంఠ ఏకాదశి: తిరుమలలో ఏర్పాట్లు

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె. శ్యామలరావు జనవరి 10 నుండి 19 వరకు నిర్వహించబోయే వైకుంఠ ఏకాదశి సందర్బంగా సాధారణ యాత్రికులకు వైకుంఠ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *