lands

గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 40 వరకు అక్రమ లేఅవుట్లు

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ హద్దులో అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటూ, అవి నిర్మితమైన ప్రాంతాలపై తనిఖీలు చేపట్టింది. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు, ఆర్టీసీ ఆఫీసు రోడ్డు మరియు సీతయ్యడొంక రోడ్డులో ఉన్న అనధికార లేఅవుట్లలో ఉన్న హద్దురాళ్లు, బోర్డులు తొలగించడం జరిగింది. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆధారంగా తీసుకుని కార్పొరేషన్ అధికారులు ఈ చర్యలకు ప్రారంభం వేశారు మున్సిపల్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటివరకు గుంటూరు నగరంలో 40 అక్రమ లేఅవుట్లను గుర్తించామని తెలిపారు. వీటిని నివారించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఈ డ్రైవ్ వారం రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. అక్రమ లేఅవుట్ల యజమానులకు నోటీసులు పంపించడం ప్రారంభించామని, ప్రజలకు వీటి వల్ల కలిగే భవిష్యత్ నష్టాల గురించి అవగాహన కల్పిస్తామని కమిషనర్ పేర్కొన్నారు.

అనధికార లేఅవుట్ల వల్ల వివిధ రకాల సమస్యలు ఏర్పడవచ్చని, అందులో ముఖ్యంగా భూ వివాదాలు, కోర్టు కేసులు, మరియు మౌలిక సదుపాయాల సమస్యలు ఉంటాయని హెచ్చరించారు. అక్రమ లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో ప్రజలు అనేక రకాలుగా నష్టపోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఇలాంటి లేఅవుట్లలో స్థలాలు లేదా ఇళ్లు కొనడం వల్ల ప్రాజెక్టు పూర్తయ్యాక మౌలిక వసతులు లేని పరిస్థితులు తలెత్తవచ్చని చెప్పారు అన్ని రకాల అధికారిక అనుమతులు పొందిన లేఅవుట్లు గుంటూరు కార్పొరేషన్ పరిధిలో తగినంతగా ఉన్నాయని, ప్రజలు ఇలాంటివి మాత్రమే ఎంచుకుని భవిష్యత్తులో భవన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అనధికార లేఅవుట్లలో పెట్టుబడులు పెట్టడం అనర్థాలకే దారితీయవచ్చని కమిషనర్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

Related Posts
నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన
Untitled 1CM Chandrababu visit to West Godavari district today

అమరావతి: సీఎం చంద్రబాబు నేడు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు దంపతులు వాసవీ మాత ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం వాసవీ Read more

అమరావతి అభివృద్ధికి 50 వేల కోట్లు: సీఎం
అమరావతి అభివృద్ధికి 50 వేల కోట్లు: సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని నిర్మాణ పనులు 50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. అమరావతి చుట్టూ 183 కిలోమీటర్ల విస్తీర్ణంలో Read more

మావోయిస్టులు దగ్ధం చేసిన కారు ఘటనలో ట్విస్ట్
Maoists mischief in Chintoo

చింతూరు మండలం సర్వేల గ్రామం సమీపంలో మావోయిస్టు మంగళవారం తెల్లవారుజామున కారును దగ్ధం చేశారు. అయితే కారులో ఉన్న వ్యక్తులను మావోయిస్టులు అవహరించారా? లేక భయంతో పారిపోయారా? Read more

నేడు స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ లాంచ్
Swarnandhra 2047

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారు. విజయవాడలో జరగనున్న ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *