srireddy

గుంటూరులో శ్రీ రెడ్డిపై కేసు నమోదు

గత వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని కొంతమంది రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. తమ స్థాయిని మరచిపోయి చంద్రబాబు , పవన్ కళ్యాణ్ , లోకేష్ ఇలా ఎవర్ని పడితే వారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం..వీడియోలు పోస్ట్ చేయడం , ట్రోల్స్ చేయడం వంటివి చేసారు..ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..సైలెంట్ గా ఉంటుందా..వరుసపెట్టి కేసులు పెడుతుంది. ఇప్పటికే అనేకమంది పై కేసులు నమోదు చేయగా..పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం , నోటీసులు జారీ చేయడం చేస్తున్నారు.

కాగా గత సీఎం జగన్ అండ నుచూసుకొనో టీడీపీ , జనసేన , బీజేపీ నేతలే లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. పోస్టులు పెట్టిన సినీ నటి శ్రీ రెడ్డిపై గుంటూరులో కేసు నమోదైంది. మాజీ కార్పోరేటర్ దాసరి జ్యోతి.. శ్రీ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులపై అసభ్యంగా నోటికొచ్చినట్లు మాట్లాడిన శ్రీ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో నగరం పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు.

అలాగే హోంమంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటి శ్రీరెడ్డిపై తూర్పు గోదావరి జిల్లాలో కేసు నమోదు అయ్యింది. వైసీపీ హయాంలో సోషల్ మీడియా వేదికగా కూటమి నేతలపై శ్రీరెడ్డి తప్పుడు ప్రచారం చేశారంటూ టీడీపీ ఏపీ మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డిపై 196, 353(2), 79 BNS, 67 ITA-2000-2008 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇలా వరుస కేసులు నమోదు అవుతుండడం తో శ్రీ రెడ్డి తనను క్షేమించండి అంటూ వేడుకోవడం చేస్తుంది.

Related Posts
మరోసారి నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్
Allu Arjun to Nampally court once again

హైదరాబాద్‌: టాలీవుడ్ నటుడు, పుష్ప 2 హీరో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో హాజరవుతున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య 70ఎంఎం థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో Read more

ఏపీలో భారీ వర్షాలు!
cyclone small

ఇటివలకాలంలో ఏపీలో తరచుగా అల్పపీడనం ఏర్పడుతున్నది. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం కోస్తా తీరం వైపుగా దూసుకొస్తోందని, దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో నేడు, Read more

హైదరాబాద్‌ వేదికగా దేశంలోనే మొట్టమొదటి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ స్టోర్‌ను ప్రారంభించిన ‘‘విక్టర్‌’’..
333

-స్టోర్‌లో కస్టమర్‌లు ఉత్పత్తులను ఎక్స్‌పీరియన్స్‌ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్ట్.. హైదరాబాద్: ప్రపంచంలోనే టాప్‌ -2 బ్యాడ్మింటన్ బ్రాండ్ ‘‘విక్టర్ రాకెట్స్’’ హైదరాబాద్‌లోని కొండాపూర్‌ Read more

మమతా బెనర్జీపై ఆర్జీ కర్ బాధితురాలి తల్లిదండ్రుల ఆరోపణలు
మమతా బెనర్జీపై ఆర్జీ కర్ బాధితురాలి తల్లిదండ్రుల ఆరోపణలు

పశ్చిమ బెంగాల్‌లోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో అత్యాచారం మరియు హత్యకు గురైన 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ తల్లిదండ్రులు శుక్రవారం మాట్లాడుతూ, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *