Ken Betwa

కేన్-బెట్వా న‌దీ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాప‌న‌

కేన్-బెట్వా న‌దీ అనుసంధానం జాతీయ ప్రాజెక్టుకు ప్ర‌ధాని మోదీ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. జాతీయ ప్ర‌ణాళిక‌లో భాగంగా దేశంలో తొలిసారి న‌దీ అనుసంధానం ప్రాజెక్టు కార్యం రూపం దాల్చింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఛాత‌ర్‌పూర్‌లో దౌదెన్ డ్యామ్‌ను నిర్మిస్తున్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కానున్నది.
కేబీఎల్పీ ప్రాజెక్టు కోసం 44,605 కోట్లు ఖ‌ర్చు
కేన్ న‌దిలో ప్ర‌వ‌హించే అద‌న‌పు నీటిని.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బెట్వా న‌దికి త‌ర‌లిస్తారు. 2021లోనే ఈ ప్రాజెక్టుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం ద‌క్కింది. కేబీఎల్పీ ప్రాజెక్టు కోసం సుమారు 44,605 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు. రాజ‌కీయ‌, ప‌ర్యావ‌ర‌ణ కార‌ణాల వ‌ల్ల ప్రాజెక్టు ఆల‌స్యం అయ్యింది. మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారి వాజ్‌పేయి నూర‌వ జ‌యంతి సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు.
బుందేల్ఖండ్‌లో పంట‌ల సాగు
న‌దీ అనుసంధానం ద్వారా యూపీలోని బేట్వా న‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలో ఉన్న బుందేల్ఖండ్‌లో పంట‌ల సాగును పెంచ‌నున్నారు. సుమారు 77 మీట‌ర్ల ఎత్తు, రెండు కిలోమీట‌ర్ల వెడ‌ల్పుతో కేన్-బెట్వా ప్రాజెక్టు కోసం డ్యామ్‌ను నిర్మిస్తున్నారు.
ప‌న్నా టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్టులో ఈ ప్రాజెక్టును క‌డుతున్నారు. దౌధాన్ డ్యామ్‌తో పాటు సుమారు 230 కిలోమీట‌ర్ల కెనాల్ కూడా నిర్మించ‌నున్నారు.

Advertisements
Related Posts
మరణం నుంచి తృటిలో తప్పించుకున్నాను: షేక్‌ హసీనా
sheikh hasina

కేవలం 20-25 నిమిషాల వ్యవధిలో, మేము మరణం నుండి తప్పించుకున్నాము అని బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా అన్నారు. అధికారం నుంచి తప్పుకున్న తర్వాత తనపై, Read more

Tollgate : రహదారులపై సరికొత్త టెక్నాలజీతో టోల్ ఛార్జీలు!
రహదారులపై సరికొత్త టెక్నాలజీతో టోల్ ఛార్జీలు!

దేశంలో జాతీయ రహదారుల రూపురేఖలు మారుతున్నాయి. ప్రయాణం మరింత సులభంగా, వేగంగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాలను తీసుకువస్తోంది. దీంతో టోల్ ప్లాజాల వద్ద గంటల Read more

కాలిఫోర్నియా గవర్నర్ రేసులో కమలాహారిస్?
కాలిఫోర్నియా గవర్నర్ రేసులో కమలాహారిస్?

అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. 2024 నవంబర్ నెలలో జరిగిన యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన విషయం అందరికీ తెలిసిందే. అయితే Read more

కేంద్ర మంత్రికి స్టాలిన్ వార్నింగ్
తమిళ విద్యా విధానంపై కేంద్రం vs తమిళనాడు మాటల యుద్ధం

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. తమిళనాడు విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP 2020) అమలు, Read more

×