cm revanth Comprehensive F

కుల‌గ‌ణ‌న స‌ర్వే పేప‌ర్లు రోడ్ల‌పై క‌నిపించ‌డంపై సీఎం ఆరా

తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే (Comprehensive Family Survey) ను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. గత వారం ఈ సర్వేను ప్రారంభించింది. ప్రతి రోజు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. ఈ సర్వే ప్రక్రియలో ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, మరియు అధికార కాంగ్రెస్ నేతలు పాల్గొంటున్నారు. అయితే ఈ సర్వే ఫారాలు రోడ్ల పై చిత్తూ కాగితాల్లా పడిఉండడం పై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

Advertisements

మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి దాటిన తర్వాత మేడ్చల్- నిజామాబాద్ దారిలో రేకుల బావి చౌరస్తా నుంచి భారత్ పెట్రోల్ బంక్ వరకు 44వ జాతీయ రహదారి పొడవునా గురువారం సాయంత్రం పూరించని సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు పడివున్నాయి. ఈ విషయం తెలుసుకున్న మేడ్చల్ మున్సిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి హుటాహుటీన సర్వే ఫారాలు పడిన చోటుకు సిబ్బందితో కలిసి వెళ్లి అన్ని ఫారాలను సేకరించి, తన వాహనంలో కార్యాలయానికి తీసుకెళ్లారు. దేశానికే దిక్సూచి, సామాజిక న్యాయం అంటూ అత్యంత ఆర్భాటంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డుపై కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయం సీఎం దృష్టికి వెళ్లడం తో దీనిపై ఆయన ఆరా తీశారు. మ‌రోసారి రోడ్ల‌పై కుల‌గ‌ణ‌న పేప‌ర్లు క‌నిపించాయ‌ని, కుల‌గ‌ణ‌నపై ఇత‌ర నెగిటివ్ వార్త‌లు క‌నిపించ‌వ‌ద్ద‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించిన‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు బీసీ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఎప్ప‌టిక‌ప్పుడు కుల‌గ‌ణ‌న‌పై రివ్యూ స‌మావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో కుల‌గ‌ణ‌న ఏ విధంగా జ‌రుగుతుంది? ఏ ప్రాంతాల్లో నెమ్మ‌దిగా జ‌రుగుతుంద‌ని ఇత‌ర అంశాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ఆరా తీస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు 44.1 శాతం స‌ర్వే పూర్తి అయింద‌ని సీఎం దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు. 51.24 ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల స‌ర్వే పూర్తి చేశామ‌ని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. స‌ర్వేలో 87వేల 807 మంది సిబ్బంది పాల్గొన్నార‌ని అధికారులు సీఎంకు తెలిపారు. వీరితో పాటూ 8,788 మంది సూప‌ర్ వైజ‌ర్లు స‌ర్వేలో పాల్గొన్నార‌ని చెప్పారు.

Related Posts
తెలంగాణకు కేంద్రం శుభవార్త
telengana central govt

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు గుడ్ న్యూస్ అందించింది. జాతీయ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ "రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక పెట్టుబడి పథకం(SASCI)"కింద తెలంగాణకు రూ.176.5 కోట్ల Read more

నిరాహార దీక్షలో ప్రశాంత్ కిషోర్ అరెస్టు
నిరాహార దీక్షలో ప్రశాంత్ కిషోర్ అరెస్టు

బీహార్‌లోని పాట్నాలో జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ను గాంధీ మైదానంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు Read more

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం
మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మనవడు కనిష్క్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ శివార్లలోని గొల్లపల్లి Read more

YoungGirls : విదేశాల్లో ఉన్నపుడు అమ్మాయిలుగా ..ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
YoungGirls : విదేశాల్లో ఉన్నపుడు అమ్మాయిలుగా ..ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

భారతీయ యువతి సుదీక్షణ విహారయాత్రకు వెళ్లి అమెరికాలో అదృశ్యమైన ఘటన ఇప్పటికీ అనుమానాస్పదంగానే ఉంది. ఇదే సమయంలో, కెనడాలో చదువుతున్న ఓ యువతిపై పబ్లిక్‌గా దాడి జరిగిన Read more

Advertisements
×