mla krt

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం

రైతులను యాచించే వారిగా చిత్రీకరించే ఆలోచన… దొంగలుగా చిత్రీకరించే ఆలోచన మానుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హితవు పలికారు. రైతు భరోసా కోసం రైతులు బిచ్చమెత్తుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈరోజు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… రైతులను యాచించే వారిగా చిత్రీకరించే ఆలోచన… దొంగలుగా చిత్రీకరించే ఆలోచన మానుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

Advertisements

రైతును డిక్లరేషన్ ఎందుకు?
రైతుల నుంచి ప్రభుత్వం డిక్లరేషన్ కోరడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. డిక్లరేషన్ ఇవ్వాల్సింది రైతులు కాదని… ప్రభుత్వమే రైతులకు ప్రమాణ పత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు ప్రమాణ పత్రం ఇవ్వాలనేది దిక్కుమాలిన పద్ధతి అన్నారు. డిక్లరేషన్ ద్వారా రైతులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైతు భరోసా కింద ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు.
రైతులకు సంక్రాంతి లోపే రైతుబంధు పడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వద్దామని పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చారు.

తమ హయాంలో ఇచ్చిన రైతుబంధు పక్కదారి పట్టిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని, ఇలాంటి నిరాధార ఆరోపణలు సరికాదన్నారు. 70 లక్షల మంది రైతులకు ఒక్క రూపాయి అవినీతి లేకుండా పలుమార్లు రైతుబంధు ఇచ్చామన్నారు. రైతుబంధులో రూ.22 వేల కోట్లు పక్కదారి పట్టాయని ఆరోపణలు చేస్తున్నారని, కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు. లెక్కలు బయటపెట్టాలన్నారు.

రైతు భరోసాకు ప్రభుత్వం ఇదివరకే దరఖాస్తులు తీసుకుందని, ఇప్పుడు మరోసారి దరఖాస్తులు అడగడం ఏమిటని ప్రశ్నించారు. మీ ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులందరికీ రైతు భరోసా ఇవ్వకుంటే ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదన్నారు. రైతును రాజుగా చేయాలన్నది తమ ఆలోచన అయితే… బిచ్చగాడిగా చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన విమర్శించారు.

Related Posts
ప్రభుత్వ నిర్లక్ష్యానికి రైతులు ఎందుకు మూల్యం చెల్లించాలి? : బండి సంజయ్
Why should farmers pay the price for government negligence? : Bandi Sanjay

హైదరాబాద్‌ : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. Read more

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ ఫోకస్
revanth reddy

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన సీఎం రేవంత్ ఫోకస్ చేసారు. ఫిబ్రవరి 1 నాటికి సర్పంచ్ ల Read more

Revanth Reddy: వివాదాస్పద వ్యాఖ్యలకి దూరంగా ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి
మహిళల అభివృద్ధికి సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ, పార్టీ మార్పుల నేపథ్యంలో రాజకీయ వర్గాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని విస్తృతంగా వ్యక్తం చేయడం, దాంతో మంత్రివర్గ విస్తరణ Read more

SLBC: టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌కు తాత్కాలిక బ్రేక్ జాడలేని ఆరుగురు
SLBC: టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌కు తాత్కాలిక బ్రేక్ జాడలేని ఆరుగురు

SLBC టన్నెల్ ప్రమాదం తర్వాత రెస్క్యూ ఆపరేషన్‌కు తాత్కాలిక విరామం ఈ ఏడాది ఫిబ్రవరి 22న నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద ఉన్న SLBC Read more

Advertisements
×