Elections to irrigation soc

ఏపీలో 14 నుండి సాగునీటి సంఘాలకు ఎన్నికలు – మంత్రి డా.నిమ్మల రామానాయుడు

అమరావతి : ఈ నెల 14 నుండి సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వ్యవసాయం, రైతాంగమే రాష్ట్రానికి ప్రాణం అనే ఉద్దేశ్యంతో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి, చివరి ఎకరం వరకూ సాగు నీరు అందజేయాలనే లక్ష్యంతో సాగునీటి సంఘాలను పునరుద్దరించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగిందన్నారు.

సాగునీటి సంఘాలకు మూడు అంచెల్లో ఎన్నికలు జరుగుతాయని, తొలి రోజు సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులను, రెండో రోజు డిస్ట్రిబ్యూషన్ కమిటీకు, మూడో రోజు ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సేవా దృక్పధంతో పనిచేసే వ్యక్తులు ఈ సంఘాలకు ప్రతి నిధులుగా ఉండటం ఎంతో అవసరమని, అటు వంటి ఎన్నికల్లో ఎటు వంటి వర్గ, పార్టీ పోరు లేకుండా సాధ్యమైనంత మేర ఏకగ్రీవంగా ప్రతి నిధులను ఎన్నుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. దేశానికి వెన్నెముఖ అయిన రైతాంగం సంక్షేమాన్ని కాంక్షిస్తూ 2015 లో తమ ప్రభుత్వం సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసి ఎన్నికల ద్వారా ప్రతి నిధులను ఎన్నుకోవడం జరిగిందన్నారు.

అయితే గత ప్రభుత్వం వాటి విలువను గుర్తించ కుండా 2020లో సాగు నీటి సంఘాలను అన్నింటినీ రద్దు చేయడం జరిగిందన్నారు. రైతులు, వ్యవసాయం పై గత ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యదోరణికి ఇది నిదర్శనం అన్నారు. గత ప్రభుత్వం సాగు నీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణకు ఎటు వంటి నిధులు విడుదల చేయకుండా ప్రాజెక్టులను అన్నింటినీ గాలికి వదిలేసిందన్నారు.

ఫలితంగా గుండ్లకమ్మ, పులిచింతల, అన్నమయ ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకు పోవడం జరిగిందన్నారు. ఈ మద్య రైవస్ కెనాల్ గేటు కూడా కొట్టుకు పోయినట్లు ఆయన తెలిపారు. అటు వంటి పరిస్థితులు తిరిగి పునరావృతం కాకుండా ఉండేందుకై తమ ప్రభుత్వం సాగునీటి ప్రాజక్టుల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Related Posts
భారతదేశం GSAT-N2 కోసం స్పేస్‌ఎక్స్ ఎంపిక..
gsatn2

భారతదేశం యొక్క GSAT-N2 ఉపగ్రహం, కా-బ్యాండ్ సాంకేతికతతో రూపొందించబడిన ఒక హై-త్రోపుట్ ఉపగ్రహం, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాలకు హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, డిజిటల్ వీడియో Read more

డ్రగ్స్ కేసులో ‘పిశాచి’ మూవీ నటి!
Actress Prayaga Martin Name

మలయాళ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీని గురించి ఇంకా మాట్లాడుకుంటుండగానే తాజాగా డ్రగ్స్ వ్యవహారం సైతం తెరపైకొచ్చింది. ఇటీవల గ్యాంగ్ Read more

తెలంగాణ తల్లి రూపాన్ని ఎలా మారుస్తారు? – ఎమ్మెల్సీ కవిత
kavitha telangana thalli

తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం పై BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తి నింపిన రూపాన్ని విగ్రహంగా మలుచుకున్నామని, Read more

ఐపీఎల్ 2025లో ధోని ఆడనున్నాడా
ఐపీఎల్ 2025లో ధోని ఆడనున్నాడా

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తన అభిమానులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమయ్యాడు.43 ఏళ్ల వయసులో కూడా ధోనీ ఐపీఎల్ 2025 సీజన్ కోసం బ్యాటింగ్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *