cyclone small

ఏపీలో భారీ వర్షాలు!

ఇటివలకాలంలో ఏపీలో తరచుగా అల్పపీడనం ఏర్పడుతున్నది. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం కోస్తా తీరం వైపుగా దూసుకొస్తోందని, దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలవైపు వెళ్తుందని, ఆ తర్వాత కోస్తా తీరం వెంబడి కదులుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో భారీ వర్షాలతోపాటు తీరం వెంబడి గరిష్ఠంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడన ప్రభావంతో నేడు విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు.
ప్రభుత్వం అప్రమత్తం
తుపాను కారణంగా ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. మంత్రివర్గం పరిస్థితులను గమానిస్తూ అధికారులను తీసుకోవసిన చర్యలపై ఆదేస్తున్నారు.
మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం
నిన్న కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కాగా, వాతావరణ మార్పుల కారణంగా ఏపీలోని కోస్తా ప్రాంతంలో తీరం దాటాల్సిన అల్పపీడనాలు తమిళనాడులో, అక్కడ తీరం దాటాల్సినవి మన రాష్ట్రంలో దాటుతున్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కాగా, ఈ నెలాఖరున అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Related Posts
తిరుపతి ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
President Droupadi Murmu ex

తిరుపతిలో టికెట్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 40 మందికి పైగా గాయపడినట్లు అధికారులు Read more

నేటి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన
Chandrababu's visit to tirupathi from today

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి రెండు రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన స్థానిక అభివృద్ధి కార్యక్రమాలు, Read more

Pawan Kalyan:ఎన్నికల హామీల అమలుపై ఏపీ సర్కారు ఫోకస్
pawan kalyan 200924

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది అధికారంలోకి వచ్చాక మొదటగా పెన్షన్‌ పెంపు అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు Read more

జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం
lorry cleaner was burnt ali

జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ఇసుక లారీ ని వెనుక నుంచి వ్యాన్ ఢీకొట్టిన సంఘటనలు మంటలు చెలరేగాయి. వ్యాను ముందు భాగంలో చిక్కుకున్న వ్యాన్ క్లీనర్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *