4 more special trains for Sankranti

ఏపీలో కీలకమైన 6 రైళ్లు రద్దు

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో కుంభమేళాకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ క్రమంలో నిత్యం తిరుగుతున్న కొన్ని రైళ్లను రద్దుచేసి కుంభమేళాకు పంపిస్తోంది. 07657 తిరుపతి – హుబ్లీ, 07658 హుబ్లీ – తిరుపతి రైలును రెండునెలలపాటు అధికారులు రద్దు చేశారు. దీంతోపాటు తిరుపతి నుంచి కదిరిదేవరపల్లి వరకు, కదిరిదేవరపల్లి నుంచి తిరుపతికి నడిచే రైలును, గుంతకల్లు నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి గుంతకల్లుకు నడిచే రైళ్లను కూడా రద్దు చేశారు. డిసెంబరు 28వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఈ రైళ్లను కుంభమేళాకు పంపిస్తున్నారు.

అధికారుల నిర్ణయంపై విమర్శలు
అధికారులపై ప్రయాణికుల విమర్శలు ప్రధానంగా తిరుపతి-హుబ్లీ రైలు రద్దుచేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రజలు నిత్యం రాకపోకలు సాగించేందుకు ఈ రైలు ఉపయోగపడుతోంది. ఇది ప్యాసింజర్ రైలు కావడంతోపాటు ఈ రెండు స్టేషన్ల మధ్య ఉన్న 62 రైల్వేస్టేషన్లలో హాల్టింగ్ ఉంది.

తిరుపతి నుంచి బయలుదేరే ఈ రైలు చిత్తూరు, కడప, అనంతపురం ఉమ్మడి జిల్లాలమీదుగా ప్రయాణించి హుబ్లీ చేరుకుంటుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ రైలు ఎంతో వెసులుబాటు కల్పిస్తోంది. ఇప్పుడు రెండునెలలు దీన్ని రద్దుచేయడంపై నిత్యం ప్రయాణించేవారు అధికారుల తీరుపై విమర్శలు చేస్తున్నారు.
ప్రయాణికులు సహకరించాలి
కుంభమేళాకే కేంద్రం ప్రాధాన్యం కుంభమేళాకు ప్రతిరోజు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారని, వారికి ఇక్కట్లు ఉండకూడదనే ఉద్దేశంతో వీటిని రద్దుచేసి అక్కడకు పంపిస్తున్నామని, తిరిగి రెండు నెలల తర్వాత ఇవి అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని అర్థం చేసుకొని అధికారులకు సహకరించాలని కోరుతున్నారు.

ఈ రెండు నెలలు ఈ మార్గంలో నడుస్తున్న ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. అయితే ప్రయాణికులు మాత్రం ఇందుకు అంగీకరించడంలేదు. స్థానిక ఎంపీని కలవడంద్వారా రైల్వేశాఖ మంత్రితో మాట్లాడి వీటిని నడిపించేలా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు.

Related Posts
ఢిల్లీ స్కూళ్లకు ఆగని బాంబు బెదిరింపులు..
Non stop bomb threats to Delhi schools

న్యూఢిల్లీ: ఢిల్లీలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం ఉదయం ఈస్ట్‌ ఢిల్లీ, నోయిడాలోని పలు స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్‌ ద్వారా వార్నింగ్‌ రావడంతో Read more

అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండించిన జగన్
Allu arjun jagan

'పుష్ప-2' మూవీ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ Read more

AP Rains: భారీ వర్షాల నేపథ్యంలో ఏపీలో ఐదు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు
schools holiday

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. అల్పపీడన ప్రభావంతో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో మంగళవారం నుంచి భారీ Read more

డోమినికా ప్రధానమంత్రి మోడీకి అత్యున్నత గౌరవం ఇవ్వనుంది
Shri Narendra Modi Prime Minister of India

కామన్వెల్త్ ఆఫ్ డోమినికా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తన అత్యున్నత జాతీయ గౌరవాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ గౌరవం, ప్రధానమంత్రి మోడీ COVID-19 మహమ్మారి సమయంలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *