ఎయిమ్స్లో చేరిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీః కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఈరోజు ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. మంత్రి సీతారామన్ అస్వస్థతకు గురైనట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. 63 ఏళ్ల సీతారామన్ను హాస్పిటల్లోని ప్రైవేటు వార్డులో అడ్మిట్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆమెను హాస్పిటల్కు తీసుకువెళ్లారు. మంత్రి నిర్మలకు సంబంధించిన చికిత్సపై మరింత సమాచారం రావాల్సి ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/category/telangana/