Perni Nani

ఎట్టకేలకు పేర్ని నానిపై కేసు నమోదు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తూ వారిని ఇబ్బందికి గురిచేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మచిలీపట్నం రేషన్‌ బియ్యం మాయం కేసులో తాజాగా వైసీపీకి చెందిన కీలక నాయకుడు, మాజీ మంత్రి పేర్నినానిపై కేసు నమోదు చేశారు.నానిపై ఏ-6 నిందితుడిగా బందరు తాలుకా పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది.


జయసుధపై ఏ1 కేసు నమోదు
ఇప్పటికే రైస్‌ గోదాం నుంచి మాయమైన బియ్యం కేసులో పేర్నినాని భార్య జయసుధను ఏ1 కేసు నమోదు చేయగా కోర్టును ఆశ్రయించడంతో ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురికి నిన్న రాత్రి మచిలీపట్నం స్పెషల్‌ మొబైల్‌ జడ్జి 12 రోజుల పాటు రిమాండ్‌ విధించారు. నిందితులుగా ఉన్న మేనేజర్‌ మానస తేజ్‌ను, పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్‌ మేనేజర్‌ కోటిరెడ్డి, రైస్‌ మిల్లర్‌ బొర్రాన ఆంజనేయులు, లారీ డ్రైవర్‌ మంగారావును రాత్రి 11 గంటలకు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా జడ్జి వారికి రిమాండ్‌ విధించారు.
జయసుధకు మళ్లీ నోటీసులు
పేర్ని నాని భార్య జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ మరోసారి నోటీసులు జారీ చేశారు. గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో గతంలో అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Related Posts
భూముల రీ-సర్వే.. గ్రామసభల్లో 41వేల ఫిర్యాదులు
Re survey of lands. 41 tho

ఆంధ్రప్రదేశ్ లోని భూములపై రీ-సర్వే నిర్వహిస్తున్న గ్రామ సభల్లో ఇప్పటి వరకు 41,112 ఫిర్యాదులు అందాయి. భూ విస్తీర్ణాల తగ్గింపు, పత్రాల్లో తప్పులు, చనిపోయిన వారి పేర్ల Read more

రాష్ట్ర ప్రజలకు వైఎస్‌ విజయమ్మ మరో లేఖ
Another letter of YS Vijayamma to the people of the state

అమరావతి : కర్నూలులో కొన్ని రోజుల క్రితం జరిగిన కారు ప్రమాదం విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాలపై వైఎస్‌ విజయమ్మ స్పందించారు. ఈ మేరకు ఆమె Read more

వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం
cyclone

ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం. విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్. Read more

వీరేంద్ర కుమార్‌తో డోలా భేటీ .
Dola met with Virendra Kumar.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన నిధులు విడుదల చేయాలని కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత శాఖ మంత్రి డా. వీరేంద్ర కుమార్‌తో ఏపీ మంత్రి డోలా శ్రీబాల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *