ప్రతీ సంవత్సరం క్రికెట్ ప్రపంచంలో కొందరు స్టార్ ఆటగాళ్లు తమ ప్రతిభతో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తారు. అయితే,2024లో మాత్రం కొందరు క్రికెటర్లు తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు.ప్రదర్శనలో గణనీయమైన పరాజయాల కారణంగా వారు అభిమానుల అంచనాలను అందుకోలేకపోయారు.అత్యంత ఆశలు పెట్టుకున్న వీరిలో భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మ కూడా ఉన్నారు.2025లో వీరు తిరిగి ఫామ్లోకి వస్తారని ఆశిద్దాం.అయితే, ముందుగా 2024లో అత్యధికంగా ఫ్లాప్గా నిలిచిన క్రికెటర్ల గురించి వివరంగా చూద్దాం.భారత దిగ్గజ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి ఈ ఏడాది పూర్తిగా పీడకలగా మారింది.

మూడు ఫార్మాట్లలో కలిపి 32 ఇన్నింగ్స్ల్లో కేవలం 655 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 21.83గా నిలిచింది, ఇది అతని స్థాయికి తగ్గది కాదు.ఈ సమయంలో అతను ఒక్క సెంచరీ, రెండు అర్ధసెంచరీలు మాత్రమే సాధించాడు. విరాట్ ఫామ్లోకి రాకపోవడం అభిమానులకు పెద్ద నిరాశగా మారింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ ఏడాది నిరాశపరిచాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 28 మ్యాచ్ల్లో 1154 పరుగులు చేసినప్పటికీ, అతని ఆటలో నిలకడ కనిపించలేదు. అతని బ్యాట్ నుంచి కేవలం రెండు సెంచరీలు మాత్రమే వచ్చాయి.
టీమిండియాను టీ20 ప్రపంచ ఛాంపియన్గా నిలబెట్టినప్పటికీ, వ్యక్తిగతంగా అతని బ్యాటింగ్లో మరింత మెరుగుదల అవసరం.న్యూజిలాండ్ కెప్టెన్ కూడా 2024లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. అతని పరుగుల ఖాతా గత సంవత్సరాలతో పోలిస్తే తక్కువగా ఉంది, ఇది అభిమానులను నిరాశపరిచింది.పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ కూడా 2024లో అంతగా మెరవలేదు. అతని స్థిరత్వం లేకపోవడం పాకిస్తాన్ జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తాను సాధారణంగా చేసే విధంగా ప్రభావం చూపలేకపోయాడు. 2024లో అతని ఫామ్ గొప్పగా ఉండలేదని చెప్పాలి. ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ స్టోక్స్ కూడా ఈ ఏడాది తన బెస్ట్ ప్రదర్శనను చూపలేకపోయాడు. బ్యాట్తోను, బంతితోను అతను నిరాశపరిచాడు.