డిసెంబర్ 26న బాక్సింగ్ డే సందర్భంగా టెస్ట్ క్రికెట్ అభిమానులకు మూడు ఆసక్తికర మ్యాచ్లు కిక్కిరిసిన క్షణాలను అందించాయి. మెల్బోర్న్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ ప్రారంభమవగా,మరో రెండు టెస్ట్ మ్యాచ్లు దక్షిణాఫ్రికా-పాకిస్తాన్, జింబాబ్వే-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగాయి.ఈ మ్యాచ్లన్నీ తమదైన ప్రత్యేకతలతో క్రికెట్ ప్రియులకు మధురానుభూతిని మిగిల్చాయి.దక్షిణాఫ్రికా,పాకిస్తాన్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగి నాలుగో రోజు ముగిసింది. రెండు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించి తమ ప్రతిభను చాటింది.అయితే, అదే రోజు ప్రారంభమైన భారత్-ఆస్ట్రేలియా టెస్ట్, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది.డిసెంబర్ 30న మెల్బోర్న్ టెస్ట్ ముగిసింది. 184 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియా భారత్ను ఓడించింది.

ఈ పరాజయం భారత జట్టుకు నిరాశనిచ్చినప్పటికీ, క్రికెట్ అభిమానులను మరో మ్యాచ్ విశేషాలు ఉత్కంఠపరిచాయి.జింబాబ్వే,ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ పరస్పర పోటీతత్వాన్ని ప్రదర్శించింది. 90వ దశకానికి చెందిన టెస్ట్ మ్యాచ్లను తలపించేలా భారీ స్కోర్లతో, ఉత్కంఠభరిత క్షణాలతో ఈ మ్యాచ్ సాగింది. మొత్తం ఐదు రోజుల్లో ఆరు సెంచరీలు నమోదవడం విశేషం. 1586 పరుగులతో పాటు 24 వికెట్లు పడగొట్టిన ఈ మ్యాచ్ చివరకు డ్రాగా ముగిసింది.తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే, 586 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
షాన్ విలియమ్స్ 154 పరుగులు చేసి జట్టు విజయం వైపు నడిపించారు.అతనికి బ్రియాన్ బెన్నెట్ (110) మరియు కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (104) బలమైన మద్దతు అందించారు.బెన్ కర్రాన్ 68 పరుగులతో మెరిసి జట్టుకు స్థిరమైన మద్దతు ఇచ్చాడు. జింబాబ్వే తరపున కేవలం ముగ్గురు బ్యాట్స్మెన్స్ మాత్రమే రెండంకెల స్కోర్కు ముందు ఔటయ్యారు. అఫ్ఘాన్ బౌలర్ అల్లా గజన్ఫర్ మూడు వికెట్లు తీశారు.ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్లో రెండు డబుల్ సెంచరీలు ఆసక్తి రేపాయి. కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ 246 పరుగులు చేయగా,రహ్మత్ షా 234 పరుగులతో అదరగొట్టారు. వికెట్ కీపర్ అఫ్సర్ జజాయ్ 113 పరుగులతో ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ను నిలబెట్టాడు.