బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు మరుపురాని సిరీస్గా నిలిచింది.భారత జట్టు సిరీస్ను 1-3 తేడాతో కోల్పోయినా, బుమ్రా తన అద్భుతమైన బౌలింగ్తో అందరి ప్రశంసలు అందుకున్నాడు.అతడు సిరీస్లో అత్యధిక వికెట్లు తీసి “ప్లేయర్ ఆఫ్ ది సిరీస్” అవార్డు దక్కించుకున్నాడు.బుమ్రా సేనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక 5 వికెట్ల హాల్ సాధించిన మూడో ఆసియా బౌలర్గా నిలిచాడు.ఇప్పటివరకు అతడు సేనా దేశాల్లో తొమ్మిదిసార్లు ఈ ఘనత సాధించాడు.ఈ జాబితాలో అతనికంటే ముందున్న వారు ముత్తయ్య మురళీధరన్ (10 సార్లు), వసీం అక్రమ్ (11 సార్లు). గాయం కారణంగా చివరి ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయకపోయినా, ఈ సిరీస్ బుమ్రా వ్యక్తిగతంగా గొప్పగా నిలిచింది.బుమ్రా మొత్తం 5 మ్యాచ్ల్లో 32 వికెట్లు పడగొట్టాడు.

ఈ సిరీస్లో అతని సగటు 13.06గా ఉండి, ఒక ఇన్నింగ్స్లో మూడుసార్లు 5 వికెట్లు, రెండుసార్లు 4 వికెట్లు తీశాడు. ఇతర బౌలర్లు ఈ స్థాయిలో ప్రభావం చూపలేకపోయారు. పాట్ కమిన్స్ మాత్రమే 25 వికెట్ల మార్కును చేరుకున్న రెండో బౌలర్గా నిలిచాడు.అంతేకాక, బుమ్రా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా నిలిచాడు. 47 ఏళ్ల తర్వాత బిషన్ సింగ్ బేడీ రికార్డును బద్దలు కొట్టాడు. 1977-78 సిరీస్లో బేడీ 31 వికెట్లు తీసి ఉన్న రికార్డును, బుమ్రా 32 వికెట్లు తీసి అధిగమించాడు. ఈ సిరీస్లో జట్టు ప్రదర్శన మాత్రం ఆశించిన స్థాయిలో లేదు.మొదటి మ్యాచ్ గెలిచి మంచి ప్రారంభం చేసినా, తర్వాత జట్టు నిలకడగా ఆడలేకపోయింది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల బ్యాటింగ్ పరాజయం భారత ఓటమికి కారణమయ్యాయి. కానీ బుమ్రా తన ప్రదర్శనతో జట్టుకు గౌరవం తెచ్చాడు.బుమ్రా ఆటతీరుతో భారత క్రికెట్ అభిమానులకు గర్వకారణంగా నిలిచాడు.
