Home Minister Anitha inaugu

ఆరిలోవ లో నూతన పోలీస్ భవనాన్ని ప్రారంభించిన హోం మంత్రి అనిత

ఆరిలోవ హనుమంతువాక వద్ద ఎకరం స్థలంలో 17 గదులతో విశాలముగా నిర్మించిన ఆరిలోవ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ఆదివారం రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమములో భాగంగా మంత్రి చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన చేసి నూతన పోలీస్ స్టేషన్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఆరిలోవ పోలీస్ స్టేషన్ అంటేనే అందరికీ జాలి ఉండేదని, తుఫాన్ షెల్టర్ భవనంలో ఎప్పుడు ఉంటుందో… ఎ ప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితిలో పోలీస్ స్టేషన్ ఉండేదని, 2018లో శంకుస్థాపన జరిగినా కూడా ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి నోచుకోని దాకానే లేదని తెలిపారు. కూ టమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీస్ శాఖ పై ప్రత్యేక దృష్టి పెట్టి మౌలిక వసతులు కల్పిస్తున్నారని తెలిపారు. సమాజంలో గుడి, బడి తో పాటు పోలీస్ స్టేషన్ కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు.


ఈ భవనంలో ఏసీబీ కార్యాలయం నిర్మాణం కోసం అదనపు అంతస్తూ నిర్మించడానికి 2.5 కోట్ల రూపాయల నిధులు మంజూరు కోసం ఎన్డీఏ ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. ఆరిలోవ పోలీస్ స్టేషన్ లో ఫర్నిచర్ ఇచ్చిన డివిస్ లేబరేటరీ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు . స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేద ప్రజలకు మేలు జరుగుతుందని, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి బాటలో నడిపించే ఘనత చంద్రబాబు దేనని తెలిపారు. పోలీస్ స్టేషన్ వద్ద మెరుగైన రహదారి నిమిత్తం జీవీఎంసీ నుండి కోటి రూపాయల నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. ఈ ప్రారంభోత్సవంలో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ ద్వారకా తిరుమలరావు, కమిషనర్ ఆఫ్ పోలీస్ శంఖబ్రత బాగ్చ్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, డీసీపీ అజిత్, డి ఐ జి గోపీనాథ్, ఏసీబీ అన్నపు నరసింహమూర్తి, ఆరిలోవ సి ఐ హెచ్ మల్లేశ్వరరావు తో పాటు పోలీసు ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts
మంత్రి కొండా సురేఖపై పరువునష్టం కేసు..విచారణ వాయిదా
Konda Surekha defamation case should be a lesson. KTR key comments

హైదరాబాద్‌: ఈ రోజు నాంపల్లి ప్రత్యేక కోర్టులో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దాఖలు చేసిన పరువు Read more

గిరిజన మహిళపై దాడి.. టీడీపీకి కొలికపూడి వివరణ
tdp mla kolikapudi

తిరువూరులో ఓ గిరిజన మహిళపై దాడి చేసి అవమానించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇవాళ పార్టీ అధిష్టానానికి వివరణ ఇచ్చారు. కొలికపూడిపై వచ్చిన Read more

కొనసాగుతున్న మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల కౌంటింగ్..
Counting of Maharashtra and Jharkhand elections continues

ముంబయి: మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ఈరోజు (శనివారం) ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల్లోనూ హోరాహోరీ పోరు జరగడం, ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ గెలుపెవరిదో నిర్దిష్టంగా తేలకపోవడంతో కౌంటింగ్‌పై Read more

COP29 సదస్సు: $300 బిలియన్ల నిధుల వాగ్దానం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు పెద్ద సహాయం
COP29 Baku

COP29 క్లైమేట్ సమ్మిట్ అజర్బైజాన్‌లో తీవ్రమైన వాదనలు జరిగిన తర్వాత ఒక అంగీకారానికి వచ్చింది. ఈ సదస్సు 33 గంటలు ఆలస్యంగా ముగిసింది. పలు సందర్భాల్లో ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *