ఎరుమెలి నుండి పంపా నది శబరి వెళ్తున్న గురు స్వామి రాంపాల్ యాదవ్,అభి యాదవ్,రామ్ యాదవ్ పెద్ది యాదవ్ ల అద్వర్యం వెళ్తున్న అయ్యప్ప స్వాములు బస్సు పంపా నది కి 15కిలోమీటర్ల దూరం లోని ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. ఘట్ రోడ్డు మలుపులో అదుపు తప్పి బోల్తా పడ్డ అయ్యప్ప స్వాముల బస్సు మూడు చెట్ల పై ఒరగడం తో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న 22 మంది అయ్యప్ప స్వాములు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.క్షతగాత్రులను కొట్టాయం మెడికల్ కాలేజి ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలు పాలైన డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు.

స్వల్పగాయలతో బయటపడ్డ అయ్యప్ప స్వాములు
కొట్టాయం నుండి శబరిమలకు వెళుతున్న యాత్రికుల వాహనం బోల్తా పడి ఒకరు మృతి, 8మందికి తీవ్రా గాయాలు క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు..!!
హైదరాబాద్ పాతబస్తీ మదన్న పేట ఉప్పర్ గూడా కు చెందిన అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనం కొట్టాయం కనమల అట్టివలం వద్ద ప్రమాదానికి గురైంది. వాహనంలో 22 మంది అయ్యప్ప భక్తులు ఉన్నారు.
హైదరాబాద్ పాతబస్తీ మాదన్నపేట ఉప్పర్ గూడాకు చెందిన అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా పడడంతో, హైదరాబాద్లోని వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాజు మృతిచెందాడు. రాజును హైదరాబాద్ సైదాబాద్ ఏకలవ్య నగర్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని పంపాడి తాలూకా ఆసుపత్రిలో భద్రపరిచారు. క్షతగాత్రులను చికిత్స కోసం కొట్టాయం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ రాజు మృతదేహాన్ని పంపాడి తాలూకా ఆసుపత్రిలో భద్రపరిచారు. హైదరాబాద్ సైదాబాద్ ఎకలవ్య నగర్లో రాజు నివాసం ఉంటున్నాడు. బస్సు ఘాట్ రోడ్డులో మూల మలుపు వద్ద కిందకు దిగుతున్న సమయంలో అదుపు తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.