Minister ponguleti srinivasa reddy

అధికారుల మీద దాడి..మనమీద మనం దాడి చేసుకునట్లే: మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌ : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వికారాబాద్‌ ఘటనపై మరోసారి మాట్లాడుతూ..బీఆర్‌ఎస్‌ నేతలపై మండిపడ్డారు. వికారాబాద్ జిల్లాకు ఫస్ట్ మేజిస్ట్రేట్‌గా ఉన్న కలెక్టర్‌పైనే హత్యాయత్నం చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. అధికారుల మీద దాడి జరగడం మనమీద మనం దాడి చేసుకునట్లేనని అన్నారు. రైతుల ముసుగులో కొంతమంది గులాబీ గూండాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేశారు. కుట్రపూరితంగా అధికారులను రైతులకు దూరం చేసే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారని మండిపడ్డారు. గులాబీ గూండాల కుట్రలను రైతాంగం అర్ధం చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

Advertisements

ప్రజలను కాపాడుకున్నట్లే, అధికారులను కాపాడుకోలేకపోతే పని చేయడానికి ఏ అధికారి ముందుకు వస్తారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కూడా ఇదే పద్ధతి పాటించారా అని నిలదీశారు. ఏం తప్పుచేశారని ఆనాడు ఖమ్మంలో మిర్చి రైతులకు సంకెళ్లు వేసి జైల్లో పెట్టారని ప్రశ్నించారు. మల్లన్నసాగర్‌లో రైతులను దేశద్రోహులుగా చిత్రీకరించారని ఆరోపించారు. పిల్లా, పాపా, ముసలి అనే తేడా లేకుండా రాత్రికి రాత్రి వారిని అరెస్ట్ చేసి సంకెళ్లు వేసిన సంగతి మరిచారా అని ప్రశ్నించారు. కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో దళితులకు బేడీలు వేసిన సంగతి మరిచిపోయారా అని నిలదీశారు. లగచర్లలో ఆ పరిస్ధితి లేదు కదా అని మంత్ర పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.

కాగా, రైతులను నష్టపెట్టాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వారి సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని తెలిపారు. రైతుల ముసుగులో అధికారులను చంపే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. లగచర్ల సంఘటను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని అన్నారు. ఈ రోజు అధికారులపై దాడి జరిగినట్లుగానే ..రేపు రాజకీయ నాయకులు, ప్రజలపై దాడి జరిగితే ప్రభుత్వం ఉపేక్షించదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.

Related Posts
కమ్యూనిటీ వెల్‌నెస్‌ను ప్రోత్సహించడానికి ‘ఫ్రీడం పార్క్’ని ప్రారంభించిన జీఈఎఫ్ ఇండియా
GEF India launched Freedom Park to promote community wellness

సమాజం యొక్క విభిన్న అవసరాలను తీర్చగల సమ్మిళిత , పర్యావరణ అనుకూల స్థలాలను ఫ్రీడమ్ పార్క్ సృష్టిస్తుంది Hyderabad: ఫ్రీడమ్ హెల్తీ వంట నూనెల తయారీదారులు, జెమిని Read more

ఇస్రాయెల్-హిజ్బుల్లా శాంతి ఒప్పందం…
Israel Hezbollah

ఇస్రాయెల్ మరియు హిజ్బుల్లా రెండు దేశాలు యూఎస్ మరియు ఫ్రాన్స్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని అంగీకరించాయి. నవంబర్ 26న ఇస్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, లెబనాన్‌తో శాంతి Read more

నెల్లూరు జిల్లాలో జికా కలకలం
zika virus

నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలుడి ఆరోగ్యంలో Read more

Gold Price : ట్రంప్ దెబ్బకు భారీగా పడిపోయిన బంగారం ధరలు
ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు! 10 గ్రాముల పసిడి రూ. 90,450

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల వల్ల ఏర్పడిన ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో బంగారం ధరలు ఇటీవల చుక్కలను తాకాయి. సంక్షోభ సమయంలో సురక్షిత Read more

×