img1

అక్రమంగా తరలిస్తున్న గోమాసం పట్టుబడిన కంటైనర్

అక్రమంగా తరలిస్తున్న గోమాసం.. పట్టుబడిన కంటైనర్. పాతిపెట్టిన పోలీసులు… ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు.!( నక్కపల్లి ,ప్రభాతవార్త) గుట్టుచప్పుడు కాకుండా జాతీయ రహదారి మీదుగా గోమాసాన్ని తరలిస్తుండగా నక్కపల్లి పోలీసులు కంటపడింది. పోలీసుల అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. విజయనగరం సమీపంలో ఉన్న సంతపాలెం వద్ద నుంచి రాజమండ్రి వైపు మినీ కంటైనర్ లో 5000 కేజీలు తో వస్తున్న వాహనాన్ని రాబడిన సమాచారం మేరకు కుమార్ స్వామి నేతృత్వంలో ఎస్సై సన్నీ బాబు తో పాటు మిగతా సిబ్బంది మండలంలోని వేంపాడు టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. ఈ మేరకు సీఏకే. కుమారస్వామి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ గోమాంసం ఎవరికి తెలియకుండా తరలిద్దామనుకున్నారని, కానీ వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం ఉదయం వాహనాలు తనిఖీ చేయగా 5000 కేజీలున్న సుమారు 15 లక్షల విలువచేసే గోమాంసాన్ని తరలిస్తున్నట్లు గుర్తించమని చెప్పారు. డ్రైవర్ మణికంఠను విచారించగా 5 గురు వ్యక్తులు కలిసి ఈ మినీ కంటైనర్ లో ఈ మాంసాన్ని తరలించేందుకు సిద్ధమయ్యారని చెప్పినట్లు తెలిపారు. ఈ మేరకు స్థానిక వీఆర్వో రెవెన్యూ అధికారులు సమక్షంలో పంచిన నిర్వహించి 5000 కేజీల గోమాంసాన్ని ఎమ్మార్వో ఆఫీస్ సమీపంలో గల ఒక చెరువు వద్ద పాతి పెట్టడం జరిగిందని సీఐ కుమారస్వామి స్థానికులు తెలిపారు. ఈ మాంసాన్ని కొన్నవారు ఎవరు.. ఎక్కడికి పంపిస్తున్నారు. దీనిని ఎవరి ద్వారా కొన్నారు… వీటన్నిటి పైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని మణికంఠ ఇచ్చిన సమాచారం మేరకు ఐదుగురు వ్యక్తులను గుర్తించమని వారిపై కేసు నమోదు చేశామని విచారణ అనంతరం అరెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పారు.

Related Posts
ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్?
employees

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. గతంలో పెండింగ్లో ఉన్న వేతన బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గద్దె Read more

మంత్రి నారా లోకేష్ కృషి వ‌ల్లే ఏపీకి ఆర్సిలర్ మిట్టల్ ఉక్కు ప‌రిశ్ర‌మ‌
ఆర్సిలర్ మిట్టల్ ఉక్కు ప‌రిశ్ర‌మ‌

ఆర్సిలర్ మిట్టల్ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ ఏపీకి వరం రాష్ట్రానికి ప్రపంచ ప్రఖ్యాత ఆర్సిలర్ మిట్టల్ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ రాబోతోందని, దీనివల్ల పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయని Read more

చాగంటి కోటేశ్వరరావుకు మరో బాధ్యత
changanti

ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులు-నైతికత విలువల సలహాదారు పదవిలో కేబినెట్ హోదాతో ఏపీ సర్కారు నియమించిన సంగతి తెలిసిందే. ఈ పదవిని స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. Read more

ఉచిత విద్యుత్ కు భారీగా ఖర్చు చేస్తున్నాం:గొట్టిపాటి
ఉచిత విద్యుత్ కోసం భారీగా ఖర్చు – మంత్రి గొట్టిపాటి కీలక ప్రకటన

రాష్ట్రంలో రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతులకు Read more