రిషి, సౌమ్య జంటగా లచ్చురామ్ ప్రొడక్షన్స్ పతాకంపై బి.వి.వి. చౌదరి దర్శకత్వంలో ఎ.రాజు నిర్మిస్తున్న 'దమ్మున్నోడు చిత్రం అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు బి.వి.వి. చౌదరి మాట్లాడుతూ 'యాక్షన్ ప్రధానంగా సాగే మాస్ చిత్రం ఇది. వందేమాతరం శ్రీనివాస్ అందించిన సంగీతం ఆకటు ్టకుంటుంది. ఎన్నో మంచి చిత్రాలను ఆదరించిన తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఈ చిత్రాన్ని ఆంధ్రరాష్ట్రమంతటా విడుదల చేస్తున్న ఆర్కే గౌడ్కు నా కృతజ్ఞతలు అని చెప్పారు.
ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ 'రిషి ఇంతవరకు ఇలాంటిపాత్రలో నటించలేదు. కథ నచ్చి ఈ చిత్రాన్ని డిసెంబర్ మూడోవారంలో మా సంస్థ ద్వారా విడుదల చేస్తున్నాం అని చెప్పారు. నిర్మాత ఎ.రాజు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: పి. ఉద§్ుకిరణ్, నిర్వహణ: యల్లంకి సదాశివరెడ్డి.