| పౌల్ట్రీ రైతులు సంతోషం |
| భుధ వారం, నవంబర్ 04, 2009 , 1:20 [IST] |
 |
|
న్యూఢిల్లీ నవంబర్ 3:- దేశంలో శీతాకాలం రావడం వల్ల, పండుగ సీజన్ కావడం వల్ల పౌల్ట్రీ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది. ఇదే సమయంలో దాణా ఖర్చు తగ్గడం వల్ల పౌల్ట్రీ రైతుల మార్జిన్లు మెరుగుపడ్డాయి. సోయామీల్ ధరలు కూడా ఇటీవల కాలంలో తగ్గుతున్నాయి.
ఆగస్టు నెలలో కోళ్ళదాణా ధర టన్నుకు రూ. 19వేలు ఉంటే ప్రస్తుతం దానిని రూ. 16,500 వద్ద స్థిరీకరించారు. సోయాబీన్ ధర దేశవ్యాప్తంగా టన్నుకు రూ.17,600 వద్ద ఉంది. మొక్కజొన్న ధరలు కూడా రూ.10,280 వద్ద స్థిరంగా ఉన్నాయి.
గత కొద్ది నెలలుగా దాణా ధరలు స్థిరంగా ఉండటం వల్ల పౌల్ట్రీ రైతులు, ట్రేడర్లు ఊపిరి పీల్చుకుంటున్నారు. అలాగే ఢిల్లీ మార్కెట్లో కోడి ధర రూ. 65 నుంచి రూ. 70కి పెరిగింది. కోడిగుడ్ల ధరలు కూడా 15 శాతం పెరిగి హోల్సెల్ మార్కెట్లో రెండున్నర రూపాయల స్థాయికి చేరింది. 2009-10 సంవత్సరంలో సోయాబీన్ ఉత్పత్తి పది శాతం పడిపోయి 97 లక్షల టన్నులకు చేరుకునే అవకాశం ఉంది.
దీనితో సోయాబీన్ ధరలు భవిష్యత్తులో పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. ఇండియాలో పౌల్ట్రీ పరిశ్రమ 15 మిలియన్ టన్నుల దాణాను ఉపయోగిస్తుంది. దాని విలువ దాదాపు రూ.15వేల కోట్లు. ఇండియాలో 23 లక్షల టన్నుల బ్రాయిలర్ మాంసం ఉత్పత్తి అవుతుందని అంచనా. బ్రాయిలర్ ఉత్పత్తిలో ఇండియాది ఐదో స్థానం.
|
|
|
|
|
|
|